హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ
టీ మీడియా, మార్చ్ 3, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో చేర్పించారు. బ్రాంకైటీస్ వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడ్డారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. జ్వరం వల్ల సోనియాను హాస్పిటల్లో చేర్పించినట్లు ట్రస్టు సొసైటీ చైర్మెన్ డీఎస్ రాణా తెలిపారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ అరూప్ బాసు నేతృత్వంలో చికిత్స సాగుతోందన్నారు. ఆమె కండీషన్ ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.