ఉత్తమ్ దంపతుల గెలుపు కోసం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు.  

ఉత్తమ్ దంపతుల గెలుపు కోసం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు.  

0
TMedia (Telugu News) :

ఉత్తమ్ దంపతుల గెలుపు కోసం చర్చి లో ప్రత్యేక ప్రార్థనలు.

టీ మీడియా, నవంబర్ 7, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ పట్టణం 229 వ బూతులో బూత్ అధ్యక్షులు కోల్లపూడి యోహాను ఆధ్వర్యంలో తిలక్నగర్ సిఎస్ఐ పెద్ద చర్చిలో ఉత్తంకుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ రైల్వే జోన్ కమిటీ మెంబర్ ఎరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గేల్లీ అర్చన రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాముల శివారెడ్డి హుజూర్నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కష్టాల శ్రవణ్  పాల్గొన్నారు. తదనంతరం ప్రచారం మొదలుపెట్టారు. ఈసందర్భంగా  పెద్దలు మాట్లాడుతూ.. సార్ కు ఎంతో ఇష్టమైన జీసస్ ప్రార్థన చేయించటం చాలా సంతోషమని, సార్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ లో సీఎం స్థానంలో ఉంటాడని, అన్ని విధాల హుజూర్నగర్ ని డెవలప్మెంట్ చేస్తాడని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తుపెట్టుకుని న్యాయం చేపిస్తామని, ఈ బూతు నుంచి మంచి మెజార్టీ రావాలని మాట్లాడారు..

Also Read : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మన్న నాగేశ్వరావు, కోల్లపూడి దయాకర్, దగ్గుపాటి బాబురావు, పెద్దారపు రామకృష్ణ, దుగ్గి సైదులు, మేళ్లచెరువు ముక్కంటి, కోల్లపూడి కాంతయ్య, కోల్లపూడి డేవిడ్, కోల్లపూడి కళ్యాణ్, సివినేని అబ్రహం, లక్ష్మల్ల సైదులు, కోల్లపూడి రాజశేఖర్, పెండ్రబిక్షం ,ఆకుల మధు, మామిడి అశోక్, కోల్లపూడి ప్రవీణ్, మామిడి రాజేష్ ,ఇంకా చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube