మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను దానం చేస్తే..

మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను దానం చేస్తే..

0
TMedia (Telugu News) :

మహాశివరాత్రి నాడు ఈ వస్తువులను దానం చేస్తే..

లహరి, ఫిబ్రవరి 13, ఆధ్యాత్మికం : శివారాధనకు మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీ శనివారం జరుపుకుంటారు. మహాశివరాత్రి శనివారం రావడం విశేషం. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఆ మహాశివుడు సంతోషిస్తాడు. ఆ శనీశ్వరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మహాశివరాత్రి రోజున దానం చేయాల్సిన వస్తువులేంటో ఓసారి తెలుసుకుందాం.ఈ వస్తువులను దానం చేయండి.. హిందూ మతంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అందుకే మహాశివరాత్రి రోజున గోవుకు రొట్టెలు, మేతను తినిపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాకుండా జీవితంలో పురోగతి ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి రోజున పాలు, పాలతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల భోలేనాథ్ అనుగ్రహం లభిస్తుంది.

Also Read : మనీ ప్లాంట్‌కి ఈ వస్తువును ముడివేస్తే..

ఆ మహా శివుడికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు. పైగా పాలు చంద్రుడికి సంబంధించినవి. ఈ పవిత్రదినాన పాలు దానం చేయడం వల్ల మీకు అపారమైన ధన ప్రాప్తి లభిస్తుంది. ఈ పండుగ రోజున పేదవారికి బియ్యం, పంచదార, పాలు లేదా ఖీర్ దానం చేయడం వల్ల మీ కెరీర్ దూసుకుపోతుంది. ఈ రోజు పేదలకు బట్టలు పంపిణీ చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మహాశివరాత్రి రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా మంచిది. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube