మహా శివరాత్రి వేళ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే..

మహా శివరాత్రి వేళ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే..

0
TMedia (Telugu News) :

మహా శివరాత్రి వేళ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే..

లహరి, ఫిబ్రవరి 16, ఆధ్యాత్మికం : హిందూ మతంలో మహా శివరాత్రి పండుగ ఎంతో పవిత్రమైనది. ఈ పర్వదినాన పరమేశ్వరుడిని ఆరాధించడానికి ఉత్తమ సమయమని పండితులు చెబుతారు. మహా శివరాత్రి రోజున శివ భక్తులంతా కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి, రాత్రంతా జాగరణలో పాల్గొంటారు. ఇలా చేయడం వల్ల ఈశ్వరుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇక ఈ పండుగ సమయంలో కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కాలినడకన శివ భక్తులందరూ శ్రీశైలానికి చేరుకుంటారు. ఇతర శైవ పుణ్యక్షేత్రాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. మహా శివరాత్రి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే, శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ వస్తువులంటే ఈశ్వరుడికి ఎంతగానో ఇష్టం కాబట్టి కచ్చితంగా తమకు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా మహా శివరాత్రి రోజున ఏయే వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం పెరుగుతుందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…

 

Also Read : ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

రాగి పాత్రలు..
హిందూ మత సంప్రదాయాల ప్రకారం, రాగి పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహా శివరాత్రి రోజున రాగి కలశం లేదా ఇతర రాగి పాత్రలను ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ రాగి పాత్రలోని నీళ్లతో శివుడికి జలాభిషేకం చేస్తే.. కచ్చితంగా శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం.

రుద్రాక్షలు..
రుద్రాక్షలంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు. రుద్రాక్షలను శివుని స్వరూపంగా భావిస్తారు. అందుకే హిందూ మతంలో రుద్రాక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాంతి, శ్రేయస్సుకు రుద్రాక్షలను చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి మహా శివరాత్రి రోజున రుద్రాక్షను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణిస్తారు. అదే విధంగా ఏక ముఖ రుద్రాక్షిని ధరించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

పరమేశ్వరుని వాహనం..

మనం ఏ శివాలయంలోకి వెళ్లినా.. శివయ్య ఎదురుగా నంది కచ్చితంగా దర్శనమిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుని వాహనం నంది. గుడిలో నందికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. మహా శివరాత్రి రోజున భోలేనాథుడితో పాటు నందిని కూడా పూజిస్తారు. కాబట్టి మహా శివరాత్రి రోజున నంది విగ్రహం ఇంటికి తెచ్చుకుంటే మంచి కలుగుతుందని చాలా మంది నమ్మకం.

శివ లింగం..

మహా శివరాత్రి రోజున రత్నాలతో చేసిన శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుంటే, శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు తమ జీవితంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
మహామృత్యుంజయ యంత్రం..

Also Read : కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!

 

మహామృత్యుంజయ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అయితే మహా శివరాత్రి రోజున మహామృత్యుంజయ యంత్రాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టించాలి. సూర్యోదయం సమయంలో ఈ యంత్రానికి పూజలు చేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని చాలా మంది నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది విశ్వాసం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube