టీ మీడియా, డిసెంబర్ 4, శ్రీశైలం:
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అధికారులు అర్చకులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వచనం మండపంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వేదపండితులు, అర్చకులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాన్ని లడ్డూ ప్రసాదాన్ని అందించి సత్కరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube