90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలి: మంత్రి హరీశ్ రావు
ములుగు: గిరిజన యూనివర్సిటీలో 90 శాతం సీట్లు ఎస్టీలకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఏడున్నర శాతం సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ చాలా ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమని చెప్పారు. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా ఉంటాయని చెప్పారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube