యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం..
– స్వయం భువుల అనుమతితో ప్రారంభం
లహరి, ఫిబ్రవరి 21, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానార్చక బృందం వార్షికోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభు నారసింహుడి గర్భాలయానికి ప్రవేశించి స్వామివారి అనుమతితో ఉత్సవాలను ప్రారంభించారు. ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా ఉత్సవ మూర్తులను చేసి ప్రధాన అర్చక బృందం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, అర్చక బృందం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మార్చి 3 వరకు 11 రోజుల పాటు జరగబోయే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read : విధి నిర్వహణలో ఉపాధ్యాయుడు మృతి
విద్యుద్దీపాలకంరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎదుర్కోలు, 28వ తేదీన సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube