తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలక బృందం

తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలక బృందం

0
TMedia (Telugu News) :

తొలిమెట్టు కార్యక్రమాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలక బృందం

టీ మీడియా, ఫిబ్రవరి 17, జన్నారం : మండలంలోని ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న తొలిమెట్టు కార్యక్రమాన్ని, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, విద్యార్థుల సంసిద్ధత ,స్లీప్ టెస్ట్ లు తదితర అంశాలను రాష్ట్ర పరిశీలగా బృందం శుక్రవారం రోజున పరిశీలించారు. మండల ప్రాథమిక పాఠశాల బాదం పెళ్లి బాలికల పాఠశాలలో జన్నారం , ప్రాధమిక ఉన్నత పాఠశాల రేండ్లగూడ లో తొలిమెట్టు, ప్రత్యేకతరగతుల నిర్వాహన పరిశీలించి, విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.

Also Read : చెవిలో పూలతో అసెంబ్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలు

అదేవిధంగా ఈ సందర్శనతో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్యను ప్రతిష్ట చేయడం, 10వ తరగతి విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రగతిని సాధించి ఉత్తమ ఫలితాలను సాధించడం కోసం అని మండల విద్యాధికారి విజయ్ కుమార్ తెలిపారు .ఈ కార్యక్రమంలో హన్మండ్లు, విద్యా సాగర్, సంతోష్, జనార్ధన్ తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube