విద్యార్థులు క్రీడలలో రాణించాలి
టీ మీడియా, ఫిబ్రవరి 7, వనపర్తి బ్యూరో : వనపర్తి బ్రిలియంట్ పాఠశాలకు విచ్చేసిన ఇండియన్ హాకీ ప్లేయర్, ట్రిబుల్ ఒలింపియన్ అర్జున పద్మ శ్రీ అవార్డు గ్రహీత నంద నూరి ముఖేష్ కుమార్, వనపర్తి పట్టణ స్థానిక బ్రిలియంట్ పాఠశాలకు ఇండియన్ హాకీ ప్లేయర్, ట్రిబుల్ ఒలింపియన్ అర్జున అవార్డు పద్మ శ్రీ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్ విచ్చేశారు.ఈ సందర్బంగా ఇండియన్ హాకీ క్రీడాకారులు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులందరూ క్రీడలలో రాణిచాలని విద్యార్థులందరు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఉంచుకోవాలి. లక్ష్య సాధనలో మొదటి, రెండు స్థానంలో ముందు ఉండేలా చూడాలని విద్యార్థులకు తెలియజేసారు.
Also Read : టీఎస్ ఆర్టీసీ ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన
అనంతరం తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ బాలుర జట్టు లో ఉండి నేడు రాష్ట్ర స్థాయిలో విజయకేతానం ఎగర వేయడంలో ప్రముఖ పాత్ర వహించిన బ్రిలియంట్ పాఠశాల విద్యార్థి దినేష్ సాగర్ ని, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు దయానంద్ రాష్ట్ర స్థాయి విన్నర్ ట్రోఫీ తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు యం. సంతోష్ కుమార్, వనపర్తి జిల్లా హాకీ సెక్రటరీ బోలెమని కుమార్, తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ట్రెసరర్ భాస్కర్ రెడ్డి,నిరంజన్ గౌడ్ , వహీద్, హాకీ సీనియర్ క్రీడా కారులు ఆదిత్య సాగర్, మధు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube