విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకోవాలి

- తహశీల్దార్ అనుపమ

0
TMedia (Telugu News) :

విద్యార్థులు క్రమశిక్షణ తో చదువుకోవాలి

– తహశీల్దార్ అనుపమ

టీ మీడియా, ఫిబ్రవరి 20, పెద్దపల్లి బ్యూరో : కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాల చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు 15 వేల రూపాయల విలువగల బుక్స్, పరీక్ష ప్యాడ్స్, పెన్స్, మొట్లపల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త జంగా ప్రభాకర్ రెడ్డి రెడ్డి విద్యార్థులకు అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ అనుపమ వ్యాపారవేత్త జంగ ప్రభాకర్ రెడ్డి హాజరై విద్యార్థులకు బుక్స్ ,పరీక్ష ప్యాడ్స్, పెన్నులను, అందజేశారు.అనంతరం జంగా ప్రభాకర్ రెడ్డిని ,తాహాసిల్దార్ అనుపమ ను విద్యార్థులు శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని,విద్యకు పేదరికం అడ్డుకాదని ప్రతీ విద్యార్థి సమయాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప ప్రయోజకులు కావాలని, తన వంతు సాయం ఎప్పుడు ఉంటుంది అని అన్నారు.

Also Read : మార్చిలో అందుబాటులోకి ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు

ప్రభాకర్ రెడ్డిని ఎమ్మార్వో అనుపమ, విద్యార్థిని విద్యార్థులు స్కూల్ యాజమాన్యం శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ,ఆర్ ఐ ఉదయశ్రీ, దాసరి విష్ణు, ఉపాధ్యాయులు శోభ ,సంధ్య విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube