నా చావుకు పోలీసులే కారణం
-హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆవేదన.
-సెల్ఫీ వీడియో తీసుకుని మందు తాగి ఆత్మహత్యాయత్నం
టి మీడియా, మార్చి 25,మంచిర్యాల : తనను పోలీసులు హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారని తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని మందు తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళితే… గత నెలలో రుకుం మహేష్ అనే యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు.అది అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ విషయంలో తమపై హత్య కేసు నమోదు చేసేందుకు తాండూరు సీఐ, ఎస్ ఐ కిరణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఒక ఫన్నీ వీడియో ఆధారంగా తనపై కేసు నమోదు చేయాలని చూస్తున్నారని ఆ వీడియోలో తెలిపాడు. సాగర్కారు డ్రైవర్గా పనిచేస్తున్నడు.మందు తాగిన అతన్నిబెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Also Read : రాష్ట్రాలపై పెత్తనం సరికాదు -ఎంపీ నామ నాగేశ్వరరావు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube