రాజ్యసభ టీఆర్ఎస్ ఎంపీలపై సస్పెన్షన్
టి మీడియా, జూలై 26,న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకుంటున్న 19 మంది ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు. సభకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు. వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. జీఎస్టీ, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపడుతున్న విషయం తెలిసిందే.
Also Read : కేంద్ర ప్రభుత్వ ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్రలను వారం పాటు సస్పెండ్ చేశారు. టీఎంసీ ఎంపీలు సుస్మితా దేవ్, డాక్టర్ సంతనూ సేన్, డోలా సేన్లతో పాటు ఇతర ఎంపీలపై కూడా వారం పాటు సస్పెన్షన్ విధించారు. వేటు పడిన వారిలో కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కూడా ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube