ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

0
TMedia (Telugu News) :

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

టీ మీడియా, నవంబర్ 8, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్‌గా పరిశీలించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలుపై విచారణ చేపట్టింది. పిల్‌లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది. మాజీ ఎంపీ తరఫున న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు జోగయ్య పిల్‌కు నెంబర్‌ను కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

Also Read : పంజాబ్‌లో భూ ప్రకంపనలు

ఈ సందర్భంగా ప్రతివాదులైన ఏపీ సీఎం జగన్‌తో పాటు సీబీఐ, సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టును మాజీ ఎంపీ కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube