దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే

మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
TMedia (Telugu News) :

దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే

– మంత్రి శ్రీనివాస్ గౌడ్

టీ మీడియా, అక్టోబర్ 6, మహబూబ్ నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మినిస్టర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో అర్హులైన పదిమంది దివ్యాంగులకు చేతుల మీదుగా పది 3 చక్రాల స్కూటీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తామని తెలిపారు. దివ్యాంగులకు తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Also Read : సిరియా మిలిటరీ అకాడమీపై డ్రోన్ల దాడి

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జిల్లా గొర్రె కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube