తెలంగాణ జన సమితి పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ జన సమితి పోస్టర్ ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

తెలంగాణ జన సమితి పోస్టర్ ఆవిష్కరణ

టీ మీడియా, మార్చి 4, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శనివారం తెలంగాణ జన సమితి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ చేసినజిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలంగాణ ఉద్యమకారులు అందరు ఏకం కావాలని మార్చి 10న బాగ్ లింగంపల్లిలో జరిగే సదస్సుకు ఉద్యమకారులు అందరూ రావాలని పిలుపునిస్తూ కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినట్లు కెసిఆర్ చెప్పుకుంటున్నారు. ప్రజల పోరాటంతో అది సాధ్యమైంది తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని అనుకుంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బాగుపడదని తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఇప్పుడు కేసీఆర్ కొత్త డ్రామాతో టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మారుస్తూ తెలంగాణ వాదాన్ని మర్చిపోయారని తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది అమరుల ఉసురు తగులుతుందని ప్రజలు అందరూ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తెలంగాణ జన సమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో నీ బండారం బయట పెడతామని హెచ్చరించారు.

Also Read  : రేవంత్‌ రెడ్డి కాన్వాయ్‌లో యాక్సిడెంట్‌

ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి షఫీ,జిల్లా ఉపాధ్యక్షులు కె బాలకృష్ణ,మండల అధ్యక్షులు పిక్కిలి బాలయ్య, టౌన్ అధ్యక్షులు కె రఘు నాయుడు,రాజేష్ కుమార్ శెట్టి,విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube