తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
టీ మీడియా, జూన్ 13,హైదరాబాద్ : తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రుతపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్ష సూచన ప్రకటించారు.
Also Read : ఎప్పటికి వైఎస్సార్ అభిమానిగానే ఉంటా’
ఇవాళ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube