తెలుగు జెండా రెపరెపలాడుతోంది: సీఎం జగన్
టీ మీడియా, జనవరి 11, అమరావతి : నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంపై ఏపీ సీఎం జగన్ ఆ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జెండా రెపరెపలాడుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, టీం మొత్తానికి కంగ్రాట్స్ చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామని సీఎం పేర్కొన్నారు.