నిన్ను..నీ కుటుంబాన్నిచంపేస్తాం
– రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్
టీ మీడియా, అక్టోబర్ 26, హైదరాబాద్ : హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందుత్వ ఎంజెండాతో రాజకీయాలు చేసే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వేరే వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన బిజెపి నుండి కొంతకాలం సస్పెన్షన్ కు గురయ్యారు. తాజాగా ఈ సస్పెన్షన్ ను ఎత్తివేసిన బిజెపి అదిష్టానం తిరిగి గోషామహల్ టికెట్ ను అతడికే కేటాయించింది. దీంతో అతడు తిరిగి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేపట్టనున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ సమయంలోనే ఆదిత్యానాధ్ తో పాటు తనను కూడా చంపేస్తామని కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను చంపుతామని బెదిరించేవారని, ఇప్పుడు ఏకంగా యూపీ సీఎం ను కూడా చంపుతామని బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేసారు.
Also Read : 28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తనకు ప్రాణహాని వుందని రక్షణ కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, పోలీసులదేనని రాజాసింగ్ పేర్కొన్నారు. చాలాకాలంగా తనకు బెదిరింపు కాల్స్ వస్తూనే వున్నాయన్నారు. వీటిని ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకువెళుతున్నానని తెలిపారు. తాజా బెదిరింపు కాల్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube