టయోటా వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
టయోటా వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
టయోటా వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
టీ మీడియా, నవంబర్ 30, బెంగళూరు: టయోటా కిర్లోస్కర్ కంపెనీ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ (64) హఠాన్మరణం చెందారు. గత రాత్రి ఆయన గుండెపోటుతో మరణించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఆయనకు భార్య గీతాంజలి కిర్లోస్కర్, కుమార్తె మనాసి కిర్లోస్కర్ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులోని హెబ్బల్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విక్రమ్ కిర్లోస్కర్ మాసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేశారు.
Also Read : లిక్కర్ స్కామ్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
కిర్లోస్కర్ గ్రూప్లో ఆయన నాలుగో తరానికి చెందినవారు. ఆయన ఇప్పటివరకు కిర్లోస్కర్ సిస్టమ్స్కు ఎండీగా, చైర్మన్గా.. అదేవిధంగా టయోటా కిర్లోస్కర్ మోటార్కు వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube