వైయస్సార్ టీ పి చొరవతో వైఎస్సార్ విగ్రహం ముందున్న ట్రాఫిక్ బూత్ తొలగింపు….
వైయస్సార్ టీ పి చొరవతో వైఎస్సార్ విగ్రహం ముందున్న ట్రాఫిక్ బూత్ తొలగింపు....
వైయస్సార్ టీ పి చొరవతో వైఎస్సార్ విగ్రహం ముందున్న ట్రాఫిక్ బూత్ తొలగింపు….
టీ మీడియా, మే01,మధిర:
మధిర వైఎస్సార్ సర్కిల్ లో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బూత్ ను వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దొంతమాల కిషోర్ కుమార్ చొరవతో తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు సుపరిపాలన అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన మరణానంతరం మధిరలోని కొంతమంది ఆయన అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని
Also Read : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అయితే పదిరోజుల క్రితం విగ్రహం ఎదురుగా లీడ్ స్పేస్ అనే ప్రైవేట్ యాడ్ కంపెనీ ట్రాఫిక్ బూత్ ఏర్పాటు చేయడం కారణంగా విగ్రహం కనపడకపోవటంతో వైఎస్ అభిమానులు ఆందోళన చెందారని ఈ విషయం తెలుసుకొని లీడ్ స్పేస్ యాజమాన్యంతో మాట్లాడి ట్రాఫిక్ బూత్ ను తొలగించడం జరిగిందని తెలిపారు. విగ్రహం ముందు ట్రాఫిక్ బూత్ ను తొలగించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ కిశోర్ కుమార్ దొంతమాలకి వైఎస్సార్ అభిమానులు ధన్యవాదాలు తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube