భారత్ జోడో యాత్రలో విషాదం.. కాంగ్రెస్ ఎంపీ మృతి
టీ మీడియా, జనవరి 14, లుథియానా : కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. శనివారం లుథియానాలో ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్కు గుండెపోటు వచ్చింది. అయితే ఆయన్ను అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఎంపీ సంతోక్ ర్యాలీలోనే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఎంపీ సంతోక్ మృతిచెందినట్లు ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ తన ట్విట్టర్లో తెలిపారు. ఫిల్లౌర్లో వాకింగ్ చేస్తున్న సమయంలో ఎంపీ సంతోక్ నీరసంగా పడిపోయారు.
Also Read : హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం
దీంతో ఆయన్ను పగ్వారాలోని హాస్పిటల్కు తరలించారు. కాంగ్రెస్ నేతలు రాణా గుర్జీత్ సింగ్, విజయ్ ఇందర్ సింగ్లాలు ఎంపీ మృతిని ద్రువీకరించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్రను నిలిపివేశారు. గతంలో సంతోక్ పంజాబ్ మంత్రిగా చేశారు. జలంధర్ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీ.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube