నాసిక్లో రైలు ప్రమాదం -పట్టాలు తప్పిన 11 బోగీలు
టి మీడియా, ఏప్రిల్ 4,నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర రైలు ప్రమాదం సంభవించింది. జయనగర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. లహ్విత్ దేవ్లాలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 11 బోగీలు పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమాచారాన్ని అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రిలీఫ్ ట్రైన్.. మెడికల్ వ్యాన్ తీసుకొచ్చి, గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నారు. కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీలను తరలిస్తున్నామని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను కూడా తెప్పిస్తున్నామని, వీలైనంత మందిని బస్సుల్లో తరలిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : విమాన గోపురానికి వెండి తోరణం బహుకరణ..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube