దేవస్థానంలో నలుగురు ఉద్యోగులు బదిలీ
టీ మీడియా, జూన్ 01, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహిస్తున్న నాలుగురు ఉద్యోగులు సాధారణ బదిలీలలో భాగంగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు.మహానంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ నీలకంఠరాజు, జూనియర్ అసిస్టెంట్ నాగ మల్లయ్య అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం, కసాపురానికి బదిలీ అయ్యారని, సీనియర్ అసిస్టెంట్ శశిధర్ రెడ్డి తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తికి బదిలీ అయ్యారని, ఎలక్ట్రిషన్ గా విధులు నిర్వహిస్తున్న చిన్న వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లా, శ్రీశైలం దేవస్థానానికి బదిలీ అయ్యారని ఈవో తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube