మహాత్మా గాంధీకీ నివాళులు
టీ మీడియా, జనవరి 30, మహబూబాబాద్ : జాతిపిత మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, మార్నేని వెంకన్న, రావుల రవిచందర్ రెడ్డి, సత్యనారాయణ రావు, వెంకన్న, ఉపేందర్, మందుల రఘు, మద్య మరియు తదితరులు ఉన్నారు.