మహాత్మా గాంధీకీ నివాళులు
టీ మీడియా, జనవరి 30, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, దేశం కోసం స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాత్మా గాంధీ శాంతియుతంగా సత్యాగ్రహ మార్గంలో దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి విజయం సాధించడంతో అది నచ్చని మతోన్మాదుల చేతిలో ప్రాణాలు అర్పించడం జరిగిందని పేర్కొన్నారు.
గాంధీ మార్గంలోనే వనపర్తిలో అఖిలపక్షం పోరాడుతుందని గాంధీ అహింసా పద్ధతిలోనే నాయకులను మార్చాలని, ఉద్దేశంతో పోరాటం చేస్తున్నామని,
Also Read : చేదోడు ద్వారానే రాష్ట్రం పరిగెడుతోంది
కనుక అసమర్ధ నాయకులు అవినీతి నాయకులు, అధికారులు పద్ధతులు మార్చుకొని వనపర్తి ప్రజలకు సేవ చేయాలని లేకుంటే గాంధీ కట్టే తీసుకొని భడ్తే పూజ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి సతీష్ యాదవ్, వెంకటేశ్వర్లు జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, రాజనగరం రాజేష్ , పొట్టి నేను గోపాలకృష్ణ నాయుడు, రాము ప్రభాకర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube