3 నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
3 నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
3 నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
లహరి, పిబ్రవరి22,తిరుమల : శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రానున్న మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్లైన్ కోటాను ఈ రోజు(ఫిబ్రవరి 22) సాయంత్ర 4 గంటలకు రిలీజ్ చేసింది. అంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ తెలిపింది. దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 24 ఉదయం 10గంటల వరకు ఉంటుంది. ఈ లక్కీ డిప్లో టికెట్లు పొందినవారు నగదు చెల్లించి టికెట్ను ఖరారు చేసుకోవాలని సూచించింది. భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది
Also Read : ఏజెన్సీ ప్రాంత వాసులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే… టికెట్ బుక్ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్లైన్లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube