వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో పాల డబ్బాలు అందచేత
టీ మీడియా మే 26 రాజన్న సిరిసిల్లా
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గండి నవ్య అనే మహిళ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు .కవల పిల్లలకు సరిపడా పాలు లేక పాల డబ్బాలకు డబ్బులు లేని పరిస్థితిని తెలుసుకొని వేములవాడ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యములో ఒక డబ్బాకు 500 రూపాయల ధర గల 20 పాల డబ్బాలను 10000 రూపాయలతో బుధవారం రోజు వారికి అందివ్వడం జరిగింది.వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మరికొందరు దాతలు కూడా ముందుకువచ్చి సహకరించి చిన్నారులని ఆదుకోవలెనని వేములవాడ లయన్స్ క్లబ్ భాద్యులు కోరారు.ఈ కార్యక్రమములో 320 జిల్లా క్యాబినెట్ మెంబర్ లయన్ తీగల వెంకటేశ్వర్ రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రాపెల్లిశ్రీధర్, సెక్రెటరీ ఆరవెళ్లి రాజశేఖర్,మాజీ అధ్యక్షులు లయన్ సామవీర రమణ,లయన్ చీకటిమల్ల వెంకటేశం, రుద్రంగిమండల పరిషత్ అధ్యక్షురాలు గంగం స్వరూపారాణి,గంగం మహేష్, గండి నవ్య కుటుంబ సభ్యులు మరియు లయన్ మిత్రులు పాల్గొన్నారు.
Also Read:వరదలు, వర్షాలతో అతలాకుతలమైన అసోం, బిహార్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube