గాజాను రెండుగా విభజించి భీకర దాడులు..
– ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
టీ మీడియా, నవంబర్ 6,గాజా : గత నెల ఇజ్రాయెల్పై ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ సైతం హమాస్పై యుద్ధం ప్రకటించి.. గాజా స్ట్రిప్పై భీకర దాడులకు దిగింది. నెల రోజులుగా ఉగ్రవాద సంస్థ హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టి.. నగరాన్ని రెండు భాగాలుగా విభజించినట్లు తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. ‘గాజా నగరాన్ని మేం నలువైపులా చుట్టుముట్టాం. ఆ నగరాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాం. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ’ అని అన్నారు.
Also Read : వేరొకరి సంపదపై ఆశ పడితే ఈ కష్టాలు తప్పవట.!
కాగా, ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 48 గంటల్లో అటు వైపు నుంచి గాజా భూభాగంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube