సందర్శకులను కాపాడుతాం     

సందర్శకులను కాపాడుతాం     

0
TMedia (Telugu News) :

సందర్శకులను కాపాడుతాం                                                                                                                 – ఎస్పీ గౌష్ ఆలం

టీ మీడియా, జూలై 26 వెంకటాపురం:

ములుగు జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,ఎన్టీఆర్ఫ్ బృందాలచే ముమ్మరంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ముత్యాల దారా జలపాతం వీక్షించడానికి వెళ్లిన సందర్శకులు దారితప్పి అడవిలో చిక్కుకున్న విషయం జిల్లా ఎస్పి గౌష్ ఆలం దృష్టికి రాగ ఇప్పటికే ఎస్పి సందర్శకులతో ఫోన్ లొ మాట్లాడారు. చిక్కుకుపోయిన పర్యాటకులతో మాట్లాడిన ఎస్పీ వాగు దాటేందుకు ఎట్టిపరిస్తుతులలో ప్రయత్నించవద్దని, రెస్క్యూ బృందాలు హుటాహుటిన తమ వద్దకు చేరుకుంటారని అప్పటివరకు వారు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని , వారి మొబైల్ బ్యాటరీ భద్రపరచుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందవద్దని మనోధైర్యంతో ఉండాలని ఆహార పదార్థాలు ఇతర రెస్క్యూ పరికరాలు తమ వద్దకు పంపించబడుతున్నాయని అప్పటివరకు తగిన జాగ్రత్తలు తీసుకొని ధైర్యంగా ఉండాలని కోరారు. జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్టీఆర్ఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి పంపడం జరిగిందని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube