చీఫ్ విప్ కు గజమాలతో ఘన స్వాగతం

చీఫ్ విప్ కు గజమాలతో ఘన స్వాగతం

0
TMedia (Telugu News) :

చీఫ్ విప్ కు గజమాలతో ఘన స్వాగతం

టీ మీడియా, మార్చి 4 పెద్దపల్లి బ్యూరో : శాసనమండలి చీఫ్ విప్ గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన తానిపర్తి భాను ప్రసాద్ రావుకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శనివారం పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన భాను ప్రసాద్ రావుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రాజీవ్ రహదారి పొడవునా ప్రతి గ్రామంలో పూలమాలలు వేస్తూ స్వాగతించారు. జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద భారీ గజమాల వేసి సత్కరించారు. అనంతరం ఎంపీ గార్డెన్స్ లో సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్మన్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయంపై దాడి.. ప్రహరీ గోడ ధ్వంసం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube