వివేకా హత్యకేసులో సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం
వివేకా హత్యకేసులో సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం
వివేకా హత్యకేసులో సాక్షి గంగాధర్ రెడ్డి హఠాన్మరణం
టి మీడియా,జూన్9,అనంతపురం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
Also Read : ప్రత్యేక కోర్టుకు మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి దేశ్ముఖ్
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు.వివేకా హత్య కేసులో గంగాధర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే మూడుసార్లు విచారించింది. కాగా, తనుకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇప్పటికే రెండుసార్లు జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డికి గంగాధర్రెడ్డి అనుచరుడు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube