వైరాను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలి
– బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్
టీ మీడియా, నవంబర్ 21, ఖమ్మం బ్యూరో : దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి, మదన్లాల్ అన్నారు. మంగళవారం మధిరలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ చరిత్రలోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అయిన పథకం రైతుబంధు అన్నారు. ఇలాంటి గొప్ప పథకాన్ని సీఎం కేసీఆర్ తప్పా ఎవరు ప్రవేశపెట్టలేదన్నారు. వైరా నియోజకవర్గంలో అందరికి దళితబంధు అమలు చేయాలన్నారు. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. వైరాను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు. సింగరేణికి పుట్టిల్లు అయిన వైరాను మరింత అభివృద్ధి చేయాలన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 23ని ఘనంగా జరుపుకునేలా చూడాలన్నారు.
Also Read : తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టింది కేసీఆర్..సున్నం పెట్టేది కాంగ్రెస్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube