మురళీకృష్ణుడి అవతారంలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడు

మురళీకృష్ణుడి అవతారంలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడు

0
TMedia (Telugu News) :

మురళీకృష్ణుడి అవతారంలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడు

టీ మీడియా, ఫిబ్రవరి 25, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసివస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన నేడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి శ్రీకృష్ణుడి (మురళీకృష్ణుడు) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి వేదమంత్రాలు పఠించారు. సాయంత్రం పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు. ఆదివారం ఉయదం జగన్మోహుడి అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు.

Also Read : టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా?

ఇక రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు, 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దోపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube