నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
టీ మీడియా, అక్టోబర్ 27, యాదగిరిగుట్ట : రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నేడు మూతపడనుంది. శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో తెలిపారు. చంద్రగ్రహణానికి ముందు రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలు బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో జరుగనున్నాయని వెల్లడించారు. చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. సంప్రోక్షణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు తెరవనున్నారు.
Also Read : నన్ను అంతమొందించేందుకు కుట్ర
ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు అయిన శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట నరసింహస్వామి ఆలయం కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి 1.06గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 2.22 గంటలకు గ్రహణం ముగియనుంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube