నిత్య బోజనశాలను ప్రారంభించిన

- జెడ్పీ చైర్మన్‌

0
TMedia (Telugu News) :

నిత్య బోజనశాలను ప్రారంభించిన

– జెడ్పీ చైర్మన్‌

టీ మీడియా, ఫిబ్రవరి 7, పెద్దపల్లి : మంథని పట్టణంలోని రాజగృహాలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్య భోజన శాలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ మంగళవారం ప్రారంబించారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ… గతంలో ఇక్కడి పాలకులను కలిసేందుకు వచ్చే పేదలు గంటల తరబడి నాయకుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఉండేదని, నాయకుల కోసం తిండీ తిప్పలు లేకుండా ఎదురుచూసేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోని సుధూర ప్రాంతాల నుంచి ఎంతో మంది పేదలు గత పాలకులను కలిసేందుకు వచ్చి ఆకలితో అవస్థలు పడేవారని,అలాంటి పరిస్థితులు ఇక ఉండకూడదని ఆనాడు ఎమ్మెల్యేగా అయిన వెంటనే తన నివాసంలో బోజన వసతి కల్పించడం జరిగిందన్నారు.

Also Read : శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం, పేదవర్గాలకు అన్నదానం చేయడంలోనే ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద బిడ్డలతో పాటు రాజగృహాకు వచ్చే వారికి పుట్ట లింగమ్మ ట్రస్టుద్వారా మద్యాహ్నబోజనం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు.పేద వర్గాలకు సేవ చేయడాన్ని తప్పు పడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube